రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు ఆయా ప్రమాదాల్లో ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో హైవేపై బైక్పై వెళుతుండగా నీలగాయ్(దుప్పి లాంటి జంతువు) ఢీకొనడంతో ముఖేష్ పాండే అనే 28 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.