సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఉద్యోగం వదులుకొని మెయిన్స్కు ప్రిపేర్ అయిన కౌశిక్ తొలి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో సత్తా చాటారు. ఓయూలో సివిల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఢిల్లీలో ఎంబీఏ చేశారు. రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటల పాటు ప్రిపేర్ అయినట్లు ఆయన చెప్పారు. ‘‘ఎంబీఏ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు సివిల్స్కు ప్రిపరేషన్ మొదలు పెట్టా. ఐఏఎస్ అవ్వాలనేది నా లక్ష్యం‘‘ అని కౌశిక్ తెలిపాడు.