ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌.. 18 మంది మావోయిస్టులు మృతి

109673చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌.. 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని కంకర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మరణించారు. అందులో ముగ్గురు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతోందని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని కంకర్ జిల్లా పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్