ఛత్తీస్గఢ్లోని కంకర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మరణించారు. అందులో ముగ్గురు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని కంకర్ జిల్లా పోలీసులు వెల్లడించారు.