బిల్కిస్ బానో కేసు.. దోషుల పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం

55చూసినవారు
బిల్కిస్ బానో కేసు.. దోషుల పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం
బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషుల పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. రెమిషన్ (శిక్ష తగ్గింపు) వచ్చే వరకు తమకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా దోషులు సుప్రీంను ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను నిరాకరించింది. సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం దీనిని తప్పుడు పిటిషన్‌గా పేర్కొంది. కోర్టులోని ఒక బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌పై మరొక బెంచ్ ఎలా అప్పీల్ చేస్తారని ప్రశ్నించింది.

సంబంధిత పోస్ట్