పక్షుల అసాధారణ మరణాలపై అప్రమత్తంగా ఉండాలని, వాటిని పశుసంవర్ధక శాఖకు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. తద్వారా బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ (నెల్లూరు), మహారాష్ట్ర (నాగ్పుర్), కేరళ (అలప్పుజ, కొట్టాయం), ఝార్ఖండ్ (రాంచీ)లలో దీని వ్యాప్తిని గుర్తించినట్లు తెలిపింది. హెచ్5ఎన్1 రకం బర్డ్ ఫ్లూ ప్రాణాంతకమని వెల్లడించింది.