లోక్సభ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. అయితే ఈ సదుపాయం దుర్వినియోగం అవుతోంది. వృద్ధులు ఓటు వేస్తున్నప్పుడు ఎన్నికల అధికారులే ఉండాలి. అయితే బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో BJP ఏజెంట్ సైతం వారితో కలిసి ఓటు వేయిస్తున్నారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి తాజాగా ECకి ఫిర్యాదు చేశారు.