టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎనిమిదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. చంద్రబాబు తరపున ఆయన సతీమణీ నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏప్రిల్ 18న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఏప్రిల్ 19వ తేదీన ఆమె రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.