రానున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశాలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అధికార బిజూ జనతాదళ్ (BJD)తో పొత్తు పెట్టుకుందంటూ వస్తున్న వార్తలపై కమలం పార్టీ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ వెల్లడించారు.