లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మరో జాబితాను బీజేపీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్కు ఎంపీ టికెట్ కేటాయించింది. ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఉజ్వల్ నికమ్ పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ధారవి ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్ పోటీ చేస్తున్నారు. ఇక ముంబై ఉగ్రదాడుల్లో కసబ్కు ఉరి శిక్ష పడాలని ఉజ్వల్ నికమ్ వాదించారు.