కేసీఆర్పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారని అన్నారు. కేసీఆర్ను అరెస్ట్ చేయాలని బీజేపీకు తొందరగా ఉన్నట్లుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ వేరు కాదని.. సీఎం రేవంత్, బండి సంజయ్ కలిసి పని చేస్తున్నారని అన్నారు.