ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ కార్యకర్త ఒకరు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం ముందు కేజ్రీవాల్ వేషధారణలో ఆయన మాట్లాడుతూ.. ‘నా పదవీకాలంలో నేను చాలా అభివృద్ధి పనులు చేశాను. మద్యం కుంభకోణం, డీటీసీ స్కామ్, యమునా కుంభకోణం వంటివి. ఇప్పుడు నేను పంజాబ్ను లండన్లా మార్చడానికి వెళ్తున్నాను’ అని పేర్కొన్నారు.