ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీరం చురుకుగా పనిచేస్తుంది. శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. మలబద్ధకం దూరమవుతుంది. ఇంకా గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మెదడుపై సానుకూల ప్రభావం ఏర్పడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది.