ఐపీఎల్లో భాగంగా ఏప్రిల్ 5న ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్కి సంబంధించి ఆన్లైన్లో టికెట్స్ మొత్తం అమ్ముడుపోయాయి. దీంతో పేటీఎం టికెట్స్ అమ్మకాలను నిలిపివేసింది. అయితే ఇదే అదునుగా కొందరు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో టికెట్స్ అమ్ముతామంటూ క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు. ఇలాంటి వాటిని అస్సలు నమ్మవద్దని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.