ఫ్రెషర్ల నియామకానికి టీసీఎస్ సిద్ధమైంది. ఏప్రిల్ 10 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. 26న
పరీక్షలు నిర్వహించనుంది. 2024 బ్యాచ్ బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఎస్
విద్యార్థులు ఇందుకు అర్హులు. నింజా, డిజిటల్, ప్రైమ్ అనే 3 కేటగిరీలకు ఈ
నియామకాలు చేపట్టనుంది. నింజాకు రూ.3.36లక్షలు, డిజిటల్ కు రూ.7లక్షలు, ప్రైమ్కు రూ.9-11.5లక్షల వరకు ప్యాకేజీ ఉండనుంది.