BREAKING: బీజేపీ నేత కన్నుమూత

536చూసినవారు
BREAKING: బీజేపీ నేత కన్నుమూత
బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప సన్నిహితుడు కేపీ. సిద్దలింగస్వామి కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మైసూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 2013లో వరుణలో సీఎం సిద్ధరామయ్యపై పోటీ చేసి కొన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కర్ణాటక టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్