మిజోరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ కూలి పది మంది కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది.