బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.
కాంగ్రెస్ తుక్కుగూడలో నిర్వహిస్తోన్న జనజాతర సభకు భద్రాచలం BRS ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. కాసేపట్లో ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో
కాంగ్రెస్ లో చేరనున్నారు. కాగా, ఇప్పటికే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా పలువురు ఎంపీలు
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.