లక్ష్మారెడ్డి మాత్రమే కాకుండా బీఆర్ఎస్కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఇలా చేరేవారి సంఖ్య డజనుగా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్. ఆ ఎమ్మెల్యేలతో రెగ్యులర్గా టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. కబురు పంపిన వెంటనే వారంతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట.