ఇటలీలో భారతీయ కూలీ మృతి

69చూసినవారు
ఇటలీలో భారతీయ కూలీ మృతి
ఇటలీలో ఓ భారతీయ వ్యవసాయ కూలీ మృతి విషాదంగా మారింది. గ్రామీణ ప్రాంతమైన ఆగ్రో పాంటినోలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సత్నామ్ సింగ్ (31) అక్కడ వ్యవసాయ కూలిగా పనిచేస్తున్నాడు. పొలంలో పనిచేస్తుండగా చేతికి కటింగ్ మిషన్ తగిలి చేయి తెగిపోయింది. ఈ మేరకు బుధవారం రోమ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందించారు. ఇది అవమానవీయ ఘటన అని, దీనికి గల కారకులకు శిక్ష పడుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్