ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణికందన్ ఇంట్లో చోరీ జరిగింది. మదురై ఉసిలంపట్టిలోని ఆయన ఇంట్లో దొంగలు చొరబడి నగదుతో పాటు, అవార్డు
లు సైతం ఎత్తుకెళ్లారు. దర్శకుడి ఇంటి తాళాన్ని పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.లక్ష నగదు, ఐదు సవర్ల బంగారు నగలు చోరీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు మణికందన్ చెన్నైలో ఉన్నారు.