మినిస్టర్స్ క్వార్టర్స్‌లో దొంగతనం

80చూసినవారు
మినిస్టర్స్ క్వార్టర్స్‌లో దొంగతనం
బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో దుండగులు చోరికి పాల్పడ్డారు. మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కట్టడాల్లో నిర్మాణ సామగ్రి చోరీకి గురైంది. కన్స్ట్రక్షన్ సైట్ నుంచి తలుపులు, స్టీల్ సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ క్రమంలోనే ఆర్ అండ్ బీ అధికారి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత హై సెక్యూరిటీ ప్రాంతంలో దొంగతనం జరగడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్