ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఈ వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండ తీవ్రతకు, వడదెబ్బకు గురైన వారి సంఖ్య రాష్ట్రంలో భారీగా పెరిగింది. సోమవారం వరకూ సుమారు 3,622 మంది వడదెబ్బకు గురైనట్లు అధికారులు తెలిపారు.