కర్ణాటకలో ముందు వెళ్తున్న కారును తప్పించబోయి ఓ బస్సు ఫ్లైఓవర్ రెయిలింగ్ను ఢీకొట్టింది. అయినా వేగం అదుపులోకి రాకపోవడంతో అవతలి లైన్లోని మరో ఫ్లైఓవర్ పైకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా ఆరుగురికి గాయాలయ్యాయి. కర్ణాటకలోని కర్ణాటక-తుమకూరు రహదారికి సమీపంలోని ఫ్లైఓవర్పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.