బస్సు బోల్తా.. నలుగురు స్పాట్ డెడ్ (వీడియో)

53చూసినవారు
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలోని 16వ నంబర్ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి భక్తులతో పూరీకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 23 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్