యూపీలోని ఘజియాబాద్లో దారుణ ఘటన జరిగింది. షాలిమార్ గార్డెన్ ప్రాంతానికి చెందిన ఓ జంట తమ బంధువుల పాపను దత్తతు తీసుకున్నారు. ఆ పాపపై దత్తతు తీసుకున్న తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఆ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో బాలిక క్లాస్రూంలో కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే హాస్పిటల్కు తరలించగా.. వైద్యులు బాలిక 5 నెలల గర్భవతి తెలిపారు. దీంతో ఆ పాప తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.