రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఓటేయండి: కేజ్రీవాల్

70చూసినవారు
రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఓటేయండి: కేజ్రీవాల్
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే I.N.D.I.A కూటమి దేశ ప్రగతికి కృషి చేస్తుందని ఢిల్లీ సీఎం, AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా బుధవారం ఆయన ర్యాలీ నిర్వహించారు. సీట్ల షేరింగ్ ప్రకారం ఢిల్లీలో 4 సీట్లలో AAP, 3 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్