బైజూస్ ఇండియా CEO రాజీనామా

83చూసినవారు
బైజూస్ ఇండియా CEO రాజీనామా
బైజూస్ ఇండియా CEO అర్జున్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. ఏడు నెలల పాటు ఆయన CEOగా కొనసాగారు. అర్జున్ స్థానంలో రోజువారీ కార్యకలాపాలను బైజు రవీంద్రన్ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీని ఏఐ, టెస్ట్ ప్రిపరేషన్, ట్యూషన్ సెంటర్లుగా మూడు విభాగాలుగా విభజించనున్నారు. తీవ్ర అప్పుల ఊబిలో బైజూస్ సంస్థ చిక్కుకుంది. ట్యూషన్ సెంటర్లను సైతం 250కి కుదించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్