తమ ఫోన్లలో బైజూస్ యాప్ ప్రీఇన్స్టాల్ చేసినందుకు ఆ సంస్థ తమకు ₹13కోట్లు బాకీ ఉందని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్కు ఒప్పో తెలియజేసింది. బైజూస్ ప్రమోటర్లు దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉన్నందున దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరింది. కాగా విచారణను జులై 3కు వాయిదా వేసిన NCLT ఆ రోజును ‘బైజూస్ డే’గా పేర్కొంది. బైజూస్పై దాఖలైన 10 పిటిషన్ల విచారణ ఆ రోజు జరగనుండటమే కారణం.