తెలంగాణ కేబినెట్ భేటీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ పథకానికి అవసరమైన నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై జ్యుడిషియల్ విచారణపై చర్చించి ఆమోదించనుంది.