రేపు మంత్రివర్గ సమావేశం.. ప్రధాన ఎజెండా ఇదే

58చూసినవారు
రేపు మంత్రివర్గ సమావేశం.. ప్రధాన ఎజెండా ఇదే
రైతు రుణమాఫీకి అర్హత నిర్ధారణే ప్రధాన ఎజెండాగా సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రేపు (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇదే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు రూ.30 వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ ప్రతిపాదించడంతో.. అందుకు అవసరమైన నిధుల సేకరణ, విధి విధానాల రూపకల్పనపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్