సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేం: కూనంనేని

69చూసినవారు
సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేం: కూనంనేని
సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరాం అన్నారు. తెలంగాణ వస్తే బొగ్గు గనులు మనకు ఉంటాయని.. గనుల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామన్నారు. కానీ కేసీఆర్ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహరించారని చెప్పారు. జులై 5న బంద్ నిర్వహిస్తున్నామని.. 15 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి కలెక్టరేట్‌లను ముట్టడిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం విషయంలో ధైర్యంగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్