లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘‘ఇండియా కూటమి తరఫున ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సభ భారతదేశ జనవాణిని వినిపించాలి. ప్రభుత్వానికి రాజకీయంగా బలం ఉండొచ్చు.. కానీ విపక్షాలు ప్రజావాణికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రతిపక్షం మీకు పూర్తి సహకారం అందిస్తుంది. విపక్షం గొంతు నొక్కడం ద్వారా సభను నడపటం అప్రజాస్వామికం అవుతుంది. మాకు మాట్లాడే అవకాశం ఇస్తారని విశ్వాసంగా ఉన్నాం’’ అని రాహుల్ అన్నారు.