పట్టపగలే కారు అద్దాలను ధ్వంసం చేసి రూ.2 లక్షల చోరీ (వీడియో)

72చూసినవారు
పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను పగలగొట్టి రూ.2 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటన తెలంగాణలోని జనగామలో చోటుచేసుకుంది. పట్టణంలోని ICICI బ్యాంకులో దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన ప్రతాప్ రెడ్డి రూ.2 లక్షలు డ్రా చేసి డబ్బును కారులో ఉంచాడు. కారును పంజాబ్ బ్యాంకు ఎదుట పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలను ద్వంసం చేసి ఈ దొంగతనానికి పాల్పడ్డారు.

సంబంధిత పోస్ట్