కోచి నగరంలోని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) దేశంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో చేప మాంసం తయారీకి శ్రీకారం చుట్టింది. అధిక డిమాండ్ ఉండే చేపలు పరిమితంగా లభ్యమవడంతో ధరలు అధికమవుతున్నాయి. దీంతో మీన జాతులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ ప్రాజెక్ట్ను కేంద్రం చేపట్టింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు నీట్మీట్ బయోటెక్ సంస్థతో CMFRI తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.