గూడ్స్ వాహనంలో తరలిస్తున్న రూ.2.73 కోట్ల నగదు స్వాధీనం

68చూసినవారు
గూడ్స్ వాహనంలో తరలిస్తున్న రూ.2.73 కోట్ల నగదు స్వాధీనం
ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.2.73 కోట్ల నగదును శనివారం కర్ణాటకలోని బెళగావి సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లి పట్టణం నుంచి హుబ్లీకి గూడ్స్‌ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు మాళమారుతి ఠాణా పరిధిలో వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా నగదు లభించింది. దీనికోసం వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేశారని, అలాగే ఈ కేసులో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని DCP రోషన్‌ జగదీశ్‌ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్