కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ శనివారం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయింది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడే వారెంటీకి సంబంధించిన పూర్తి వివరాలను వినియోగదారులకు స్పష్టంగా చెప్పాలని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు కేంద్రం స్పష్టం చేసింది. వారెంటీ విషయంలో ప్రపంచంలో అత్యుత్తమ ప్రమాణాలను భారత్లో అనుసరించాలని తయారీ కంపెనీలను కోరింది.