రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఉంటుంది: నిర్మలా సీతారామన్

75చూసినవారు
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఉంటుంది: నిర్మలా సీతారామన్
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఎప్పుడూ ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సకాలంలో జీఎస్టీ బకాయిల చెల్లింపు, పన్నుల పంపిణీ ద్వారా రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు. వివిధ సంస్కరణల కోసం కేంద్రం అందిస్తున్న 50 ఏళ్ల వడ్డీరహిత రుణాలను అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్