నీట్-UG2024 ప్రవేశ పరీక్షను రద్దు చేయకపోవడానికి కారణాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. నీట్-యూజీ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ వల్ల కొందరు విద్యార్థులు లాభపడి ఉన్నప్పటికీ.. పరీక్షను రద్దు చేస్తే ఎంతో కష్టపడి చదివి రాసిన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. పాసైన వారి కష్టమంతా వృథా అవుతుందని చెప్పారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.