కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో వివిధ రంగాలకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పర్యావరణ హితం కోరుతూ కొన్ని ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతులపై ప్రభుత్వం సుంకాలను పెంచింది. అమ్మోనియం నైట్రేట్పై 10 శాతం, బయోడిగ్రేడబుల్ సాధ్యంకాని ప్లాస్టిక్పై 25 శాతం కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. దీంతో ప్లాస్టిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. టెలికం పరికరాల ధరలు కూడా పెరగనున్నాయి.