చెప్పులు, తోలు పరిశ్రమకు మద్ధతు ఇవ్వడానికి కేంద్రీకృత ఉత్పత్తుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లెదర్, నాన్ లెదర్ చెప్పుల ఉత్పత్తికి అవసరమైన అధునాతన యంత్రాలకు అనుమతులను సులభతరం చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రూ.400 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని, రూ.11 లక్షల కోట్లకుపైగా ఎగుమతులు జరుగుతాయని అంచనా వేశారు.