క్యాన్సర్ను గుర్తించటం ఆలస్యం కావటంతో మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గంగా సర్వైకల్ క్యాన్సర్ను ముందుగానే కనిపెట్టే 'స్మార్ట్ స్కోప్' అనే డిజిటల్ డివైజ్ను రూపొందించినట్లు పుణెలోని పెరివింకిల్ టెక్నాలజీస్ సంస్థ వ్యవస్థాపకురాలు వీణా మోక్తాలి తెలిపారు. స్మార్ట్ స్కోప్ నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుందని, చిన్న చిన్న ఆస్పత్రుల్లో కూడా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.