దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు రికార్డులు

51చూసినవారు
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు రికార్డులు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా మహిళల జట్టు భారీ స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 525 పరుగులు చేసింది. దీంతో మహిళా క్రికెట్ చరిత్రలో తొలి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. 1935లో ఇంగ్లండ్ చేసిన 431/4 అత్యధిక స్కోరు. 89 ఏళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది. షెఫాలీ (205) డబుల్ సెంచరీ చేయగా, స్మృతి (149) సెంచరీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్