జాతీయ అవార్డు అందుకున్న చందూ మొండేటి

85చూసినవారు
జాతీయ అవార్డు అందుకున్న చందూ మొండేటి
70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచిన సంగతి తెలిసిందే. ‘కార్తికేయ 2’ దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్