నీట్ ఎగ్జామ్ లో మారిన పేపర్.. ఆందోళనలో విద్యార్థులు (వీడియో)

51చూసినవారు
కొమరంభీం జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నిర్వహించిన నీట్ పరీక్షా కేంద్రంలో పేపర్ మారింది. దీంతో పరీక్ష రాసిన 299 మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులకు ఇవ్వాల్సిన సెట్‌కు బదులు నిర్వాహకులు మరో సెట్ ఇచ్చారు. తలిదండ్రులు, విద్యార్థులు గుర్తించటంతో విషయం తెలిసింది. అధికారుల సమాచార లోపంతోనే ప్రశ్నపత్రం మారినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌ను ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్