మూడో టెస్టుకు తుది జట్టులో మార్పులు?

84చూసినవారు
మూడో టెస్టుకు తుది జట్టులో మార్పులు?
రాజ్‌కోట్ వేదికగా ఈనెల 15 నుంచి భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు జరుగనుంది. అయితే, ఈ టెస్టుకు టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కీపర్ కేఎస్ భరత్ స్థానంలో ధ్రువ్ జురెల్ అరంగ్రేటం చేయనున్నట్లు సమాచారం. భరత్ కీపింగ్‌లో రాణిస్తున్నప్పటికీ బ్యాటింగ్‌లో వరుసగా విఫలం అవుతుండటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇక బుమ్రా మూడో టెస్టు ఆడతారని నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇవ్వొచ్చని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్