18వ లోక్సభకు స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా రాజీనామా చేశారు. కొత్తగా స్పీకర్ పదవికి నామినేషన్ వేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఉంది. జూన్ 26 లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అయితే లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీఏ అభ్యర్థిని మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. జూన్ 26న జరగనున్న స్పీకర్ ఎన్నికకు ఒకరోజు ముందు ఎన్డీఏ తమ అభ్యర్థిని వెల్లడించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.