నితీశ్‌ను కలిసిన నీట్‌ నిందితుడి భార్య.. ఫొటో వైరల్

71చూసినవారు
నితీశ్‌ను కలిసిన నీట్‌ నిందితుడి భార్య.. ఫొటో వైరల్
నీట్‌ పేపర్‌ లీక్‌పై బీహార్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆర్జేడీ సోమవారం ఒక ఫొటోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. నీట్‌ కేసులో పరారీలో ఉన్న నిందితుడు సంజీవ్ ముఖియా భార్య మమతా దేవి, బీహార్ సీఎం నితీశ్‌ కుమార్, ఎన్డీయే నేతలతో కలిసి ఉన్న ఫొటోను అప్‌లోడ్‌ చేసింది. కాగా, ఎన్డీయే నేతలతో సంజీవ్ ముఖియాకు సంబంధాలు ఉన్నాయని ఆర్జేడీ ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్