తెలంగాణలో పెళ్లి విందులో ఘర్షణ నెలకొంది. చెన్నూరులోని ఎమ్మెల్యే కాలనీలోని ఆదివారం రాత్రి పెళ్లి విందులో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో ఆరుగురు కత్తిపోట్లకు గురైయ్యారు. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.