‘ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్‌ది మెతక వైఖరి’

62చూసినవారు
‘ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్‌ది మెతక వైఖరి’
ఉగ్ర అనుమానితుల పట్ల కాంగ్రెస్ మెతక వైఖరి అనుసరించిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో పేదలు ఆకలితో అలమటించారని.. ఉగ్రవాదులకు మాత్రం బిర్యానీ పెట్టారని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా 80 కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్ అందిస్తోందని గుర్తుచేశారు. తీవ్రవాదం, ఉగ్రవాదం ముగిసిపోయాయని, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని శాశ్వతంగా రద్దుచేశామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్