బీజాపూర్‌లో ఎదురుకాల్పులు, ఇద్దరు నక్సల్స్‌ మృతి

81చూసినవారు
బీజాపూర్‌లో ఎదురుకాల్పులు, ఇద్దరు నక్సల్స్‌ మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకోవడంతో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, ఏకే 47 రైఫిళ్లు, నిషేధిత సాహిత్య పుస్తకాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్